ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి( Bal Reddy ) ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ముస్తాబాద్ మండలంలోని మొర్రాయిపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సమన్యాయం దక్కుతుందన్నారు.ఈ బిఆర్ఎస్ 9 యేండ్ల పాలనలో దగా మోసాలు తప్ప చేసిందేమీ లేదనీ,అలాగే పుట్టబోయే పాపకు 1,50, 000 రూపాయలు అప్పు చేసి పెట్టాడన్నారు.

దళిత సీఎం లేడు,దళితులకు మూడెకరాల భూమి లేదు, దళిత బంధు కేవలం బిఆర్ఎస్ కార్యకర్తలకు అందుతుందనీ దుయ్యబట్టారు.వరి వద్దు ఉరి ముద్దు అన్న కచరా కు మనం ఉరి వేయాలి అన్నారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామనీ, కౌలు రైతులకు 15000, వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు ఏటా ఇస్తాము తెలిపారు.

Advertisement

ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని అన్నారు.అలాగే గృహ జ్యోతి(G ruha Jyothi ) పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఇస్తామని తెలియజేశారు.

ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలము,ఐదు లక్షల రూపాయల సహాయం అందిస్తామని,ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామన్నారు.నిరుద్యోగులకు ప్రత్యేక జాబ్ కాలెండర్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తామని, యువ వికాసం పథకం కింద ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

మెగా డీఎస్సీ కూడా నిర్వహిస్తామని, చేయూత పథకం ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు 4000 రూపాయల పింఛన్ అందిస్తామన్నారు.అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ( Aarogyasri ) భీమా కింద పది లక్షల రూపాయలు అందజేస్తామన్నారు.

మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని ఈ సందర్భంగా వారన్నారు.కాంగ్రెస్ పార్టీ చెబితే చేస్తుంది దానికి నిదర్శనమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండo రాజి రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి వంగమోహన్ రెడ్డి, మోర్రాయిపల్లే గ్రామ శాఖ అధ్యక్షులు కుమార్ యాదవ్, మద్దికుంట గ్రామ శాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య,చీకోడు గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ రమేష్, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు తలారి నర్సింలు,ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, రాజేశం,ఆకారం, రాజేష్, బద్దిపడిగ మహేష్ రెడ్డి,హరీష్, రాజనర్సు,శంకర్,రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News