గుడివాడ "మేమంతా సిద్ధం"( Memanta Siddham ) సభలో సీఎం జగన్( CM Jagan ) సంచలన స్పీచ్ ఇచ్చారు.
తనపై దాడులు చేస్తే బెదిరేది లేదని.
తన సంకల్పం చెక్కుచెదరదని అన్నారు.పైగా ఈ స్థాయికి దిగజారారు అంటే.
విజయానికి వైసీపీ ( YCP ) దగ్గరలో ఉందని వాళ్ళు దూరంగా ఉన్నారని దానార్థం.మీ తాటాకు చప్పుళ్లకు.
అదరను బెదరను అని అన్నారు.ఇలాంటి దాడుల వల్ల ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పం పెరుగుతుంది తప్ప ఏమాత్రం.
వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.నుదుటిపై చేసిన గాయం పెద్ద ప్రమాదం కాలేదు.
దీన్నిబట్టి భగవంతుడు నా విషయంలో పెద్ద స్క్రిప్టే రాశాడు.అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది.కానీ చంద్రబాబు( Chandrababu ) హయాంలో పేదల ప్రయోజనాలకు చేసిన గాయాలు.ఎవరు మర్చిపోలేరు.
మోసం చేయటం గాయం చేయటం కుట్రలు చేయటం చంద్రబాబు నైజం అయితే.ఇంటింటికి మంచి చేయటం నా నైజం అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడు సెంట్ల స్థలం, రుణమాఫీ, సింగపూర్ తరహా అభివృద్ధి లాంటి హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ దుయ్యబట్టారు.మళ్లీ బాబు, దత్తపుత్రుడు, బీజేపీ కలిసి వస్తున్నారు.లంచాలు లేని పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి.175కి 175 సీట్లలో ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు.సిద్ధమేనా.
దేవుడి దయతో జగన్ అనే నేను మళ్లీ మీ ముందుకి వస్తాను అని ఘంటాపథంగా చెప్పారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy