జన్మదిన వేడుక విందు లో ఘర్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన విందులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.

ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.

గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.గ్రామానికి చెందిన భూమయ్య-మధు అనే యువకుల ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బండరాయి, గడ్డపారలతో దాడి చేసుకున్నారు.

దీంతో భూమయ్య తలకు తీవ్ర గాయం కాగా.జి.మధు, ఆర్.మధులకు స్వల్ప గాయాలయ్యాయి.

తండ్రి జ్ఞాపకార్థం గ్లాసుల వితరణ
Advertisement

Latest Rajanna Sircilla News