నిజాయితీ చూపిన ఆర్టీసి డ్రైవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కామారెడ్డి నుండి కరీంనగర్ ఆర్టీసి బస్సు( Karimnagar RTC Bus ) లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు లగేజ్ మర్చిపోవడం జరిగింది.

అందులో డబ్బులు,బంగారం, విలువైన వస్తువులు కూడా వున్నాయి.

విధులు నిర్వహిస్తున్న ఆ బస్సు డ్రైవర్ తన నిజాయితీ నీ చాటి ఆ లగేజి నీ విలువైన వస్తువులను ఎవరిది ఏంటిది అని తెలుసుకొని వాటిని ప్రయాణికుడి కి దగ్గరికి చేర్చడం జరిగింది.ఆర్టిసి డ్రైవర్ గొల్లపల్లి రాజు( Gollapalli raja ) చూపించిన నిజాయితీ నీ మానవతా దృక్పథం చాటిన డ్రైవర్ నీ అభినందిస్తూ కంచర్ల రవి గౌడ్ పాత బస్టాండ్ లో వారిని సన్మానించి అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్టీసి సిబ్బంది తన తోటి డ్రైవర్స్ కూడా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ రాజయ్య, కార్గో లాజిస్టిక్స్ డి ఎం ఈ శేఖర్, కండక్టర్ రమేష్, ఆర్టీసీ సిబ్బంది పరమేష్, అజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News