ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభం పెల్లి లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం( Medipalli Satyam ) కు స్తంభం పెల్లి సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్( Jyoti Karunakar ) లు వినతి పత్రాన్ని అందజేశారు.

శుక్రవారం మండలంలోని గుండనపల్లి లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరుకాగా స్తంబంప్లలి సర్పంచ్ తమ గ్రామం లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.

అలాగే చంద్రగిరి పల్లి లో విద్యుత్ దీపాలు లేక చీకటి పూట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే విద్యుత్తు స్థంబాల తో పాటు దీపాలు అమర్చి సమస్య పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News