ఉప్పల కాంతారెడ్డిని పరామర్శించిన రంగన్న

సూర్యాపేట జిల్లా:సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఉప్పల కాంతారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఉండడంతో విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే,సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి బుధవారం ఆయనను కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయనతో కొంతసేపు ముచ్చటించి నాటి ఉద్యమ స్మృతులను నెమరువేసుకున్నారు.

మరికొన్ని ఏళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను ఈ విధంగానే మిమ్మల్ని పరామర్శిస్తూనే ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,వెంకట్ రెడ్డి,నరసింహారావు,ములకలపల్లి రాములు,డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News