మన హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు,వ్రతాలు చేసుకొనే సమయంలో అగరవత్తులను వెలిగించటం సర్వ సాధారణమే.ఇలా వెలిగించటం వెనక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి.
పురాతన భారతీయ సంప్రదాయంలో అగరవత్తులను వెలగించడం వల్ల గది అంతా సువాసనతో నిండి ఉండేది.అంతేకాకుండా ఆ రోజుల్లో ఉపయోగించే అగరబత్తిలలో ఔషధ గుణాలు ఉండేవి.
ముఖ్యంగా వాటిలో గుగ్గిలం, సాంబ్రాణి వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించేవారు.ఈ రోజుల్లో కూడా వీటిని ఎక్కువగా వాడుతున్నారు.
బోస్విలియా చెట్టు లభించే జిగురు నుంచి సాంబ్రాణిని తయారుచేస్తారు.సాంబ్రాణి నుంచి వెలువడే సువాసన మెదడులోని టీర్పీవీ3 అనే ప్రొటీన్పై ప్రభావం చూపుతుంది.
చర్మం కింద మృదువైన స్పర్శకు అవసరమైన స్రావాలను ఈ ప్రొటీన్ విడుదల చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది.ఇక గుగ్గిలం విషయానికి వస్తే అథర్వణ వేదంలోనూ కూడా దీని గురించి వివరించారు.
గుగ్గిలం చెట్ల నుంచి మండు వేసవిలో లభించే జిగురు ద్వారా గుగ్గిలంను తయారుచేస్తారు.ఇది క్రిమిసంహారిగానే కాదు, రక్తస్రావాలను నివారించే లక్షణాలను కలిగి ఉంటుంది.
సాంబ్రాణి,గుగ్గిలంతో తయారుచేసిన అగరబత్తులను వెలిగించినప్పుడు గాలిలో కాలుష్యాన్ని నివారిస్తుంది.అలాగే అగరవత్తుల సువాసన కారణంగా మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత చాలా బాగుంటుంది.
అందువల్ల అగరవత్తులను పూజలో వెలిగిస్తారు.అగరవత్తులు వెలిగించినప్పుడు వెలువడే సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాల్లో పాజిటివ్ వేవ్స్ వ్యాప్తి చెందుతుంది.
ఏదైనా నెగిటివ్ వేవ్స్ ఉంటే వాటిని తటస్థంగా చేస్తుంది.