రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ( Rajanna Sircilla Police Departmentt ) ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన 5K రన్ కు భారీ స్పందన.
ఉత్సాహంగా పాల్గొన్న చిన్న, పెద్ద,యువతి, యువకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు.
ముఖ్య అతిథులుగా హాజరై విజేతలుగా నిలిచిన 15 మందికి సైకిళ్ళు బహుమతిగా అందించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ), జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ).సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్, నేతన్న చౌక్, కొత్త చెరువు, చంద్రంపేట మీదుగా తిరిగి అంబేద్కర్ చౌక్( Ambedkar Chowk ) వరకు సాగిన 5కె రన్.డ్రగ్స్ & గంజాయి మహమ్మారి మత్తులో కళ్ళముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే మౌనంగా ఉందామా! పసివాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతుంటే సాటి పౌరునిగా ఎలా మౌనంగా ఉందాం.డ్రగ్స్, గంజాయిని( Drugs ) నిర్మూలించేందుకు బాధ్యత గలా పౌరులుగా సమాచారం అందించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు జిల్లా కలెక్టర్,ఎస్పీ లు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నెట్టేసుకుంటున్నారని అన్నారు.
భావి జీవితానికి అవరోధంగా నిలుస్తూన్న మత్తు పదార్థాలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బింగించాలని అన్నారు.సిరిసిల్ల జిల్లాలో యువత మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను ఉత్తేజ పరిచే విధంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలన అవగాహన 5కె రన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
యువత ముఖ్యంగా మతుపదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవలన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి,ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలన్నారు.యువత మత్తుపదార్థాలకు బానిసలై అనారోగ్యం పాలవుతూ బంగారు భవిష్యత్తును కోల్పోవడమే కాకుండా, ఎన్నో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ తమ చేతులారా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, దానికోసమే ముందుగానే మత్తు పదార్థాలను నిర్మూలించి యువతను మత్తు అనే మహమ్మారి నుండి కాపాడుకోవాలని సూచించారు.
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం పోలీస్ వారికి అందించాలని పిలుపునిచ్చారు.జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా జిల్లాలో డ్రగ్స్, గంజాయి కి అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించడానికి డి-ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు( D Addiciton Center ) మానసిక వైద్యుల ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాధకద్రవ్యాల నిర్మూలన అవగాహన 5కె రన్ కి అనూహ్య స్పందన రావడం జరిగిందని త్వరలో జిలాల్లో మారథాన్ పోటీలు( Marathon Competition ) ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
గత నెల రోజుల నుండి ఈ 5కె రన్ నిర్వహణ కోసం కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు.ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని, యువత ఇలాంటి గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడితే కలిగే అనర్థాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు.
విజేతలు పోలీస్ స్టేషన్ వారిగా.
1.రాహుల్ ,వీర్నపల్లి.2.విజేయ్ కుమార్, రుద్రంగి.3.బాలయ్య, వీర్నపల్లి 4.సురేష్, వీర్నపల్లి 5.
రజినీకాంత్ , ఎల్లారెడ్డిపేట్ 6.వినోద్ కుమార్, రంగినేని ట్రస్ట్.7.వకిల్ , రుద్రంగ 8.రాజు , ఎల్లారెడ్డిపేట్
1.హారిక , తంగళ్ళపల్లి.2.మౌనిక, తంగళ్ళపల్లి.3.విశాల, తంగళ్ళపల్లి.4.మౌనిక , తంగళ్ళపల్లి.
1.రవి కుమార్, ఫోటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ.
1.దేవరాజ్, డి ఎ ఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా.2.శంకర్, ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్.ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు,సి.
ఐ లు,ఆర్.ఐ లు,ఎస్.
ఐ లు,డాక్టర్ లు,యువతి, యువకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy