వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర.. బంగ్లా పై ఘన విజయం..!!

వరల్డ్ కప్ టోర్నీ( World Cup 2023 )లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది.

ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లపై విజయం సాధించిన టీమిండియా( India ) గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించింది.

పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్( Bangladesh ) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయడం జరిగింది.

బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్ 51, లిట్టన్ దాస్ 66 పరుగులు చేసి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు.కానీ తర్వాత భారత బౌలర్లు( Indian Bowlers ) సమిష్టిగా రాణించడంతో.

వెంట వెంటనే వికెట్లు పడ్డాయి.

Advertisement

బంగ్లాదేశ్ 50 ఓవర్లకు ఎనిమిది టికెట్లు నష్టానికి 256 పరుగులు చేసింది.అనంతరం 257 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ దిగగా 41.3 ఓవర్లలో కేవలం 3 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. విరాట్ కోహ్లీ (103*).

సూపర్ సెంచరీ చేయగా గిల్ 53, రోహిత్ 48, రాహుల్( Rahul ) 34 రన్స్ తో రాణించారు.విరాట్ కోహ్లీ 97 బంతుల్లో ఈ సెంచరీ సాధించడం జరిగింది.

ఇందులో నాలుగు సిక్స్ లు, ఆరు ఫోర్ లు ఉన్నాయి.దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్( International Cricket ) లో అత్యంత వేగంగా 26,000 పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.

ఈ ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతూ ఉండటంతో క్రికెట్ ప్రేమికులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం
Advertisement

తాజా వార్తలు