టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప అనే మాస్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ముచ్చటగా మూడోసారి జతకడుతున్న సుకుమార్, ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా సుక్కు తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ను వాడాలని అనుకున్నాడు.అయితే కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో పుష్ప సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక లాక్డౌన్ తరువాత ఈ చిత్ర షూటింగ్ను మొదలుపెట్టేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.కానీ ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కాకుండా ఇండియన్ టెక్నీషియన్స్ను తీసుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పట్లో విదేశీయులు భారత్లోకి రావడం వీలు కాకపోవడంతో సుక్కు ఈ నిర్ణయం తీసుకున్నాడు.మొత్తానికి లాక్డౌన్ ప్రభావం పుష్ప సినిమాపై కూడా పడిందని చెప్పాలి.
రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy