కరోనా దెబ్బకు ఇండియన్స్‌కు ఓటేసిన సుకుమార్

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప అనే మాస్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ముచ్చటగా మూడోసారి జతకడుతున్న సుకుమార్, ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా సుక్కు తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను వాడాలని అనుకున్నాడు.

అయితే కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో పుష్ప సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇక లాక్‌డౌన్ తరువాత ఈ చిత్ర షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.

కానీ ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కాకుండా ఇండియన్ టెక్నీషియన్స్‌ను తీసుకోవాలని చూస్తున్నాడు.

ఇప్పట్లో విదేశీయులు భారత్‌లోకి రావడం వీలు కాకపోవడంతో సుక్కు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మొత్తానికి లాక్‌డౌన్ ప్రభావం పుష్ప సినిమాపై కూడా పడిందని చెప్పాలి.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఛత్తీస్‎గఢ్‎లో ఘోర రోడ్డుప్రమాదం.. 15 మంది మృతి