బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థి ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ పాఠశాలలో పదవ తరగతి చదివిన ఎం.శ్రీలేష్ గౌతమ్ బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు జ్ఞానదిప్ పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ తెలిపారు.

అనంతరం ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ , ఎస్ఐ ఎన్.రమాకాంత్ లు విద్యార్థి శ్రీలేష్ గౌతమ్ ను అభినందించారు.ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.

విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు.రాచర్ల బొప్పపూర్ జ్ఞానదీప్ హైస్కూల్ కు చెందిన విద్యార్థి శ్రీలేష్ గౌతమ్ పదవ తరగతిలో అత్యధిక మార్కులను సాధించి బాసర త్రిబుల్ ఐటీ లో సీటును సాధించాడు.

ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ గౌడ్ , ఎస్ఐ ఎన్.రమాకాంత్ విద్యార్థి శ్రీలేష్ గౌతమ్ ను మేమంటో , శాలువాతో సన్మానించారు అనంతరం ఎస్ఐ రమాకాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ సిబ్బందితో పాఠశాల నిర్వహిస్తున్న కరస్పాండెంట్ లక్ష్మినారాయణ ను అభినందించారు.పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి సహకరిస్తున్న ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయుల బృందానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
పీఎస్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Latest Rajanna Sircilla News