తండ్రికి కుమార్తెలకు ఎంత అనుబంధం ఉంటుందో అదే తరహాలో తల్లికి కొడుకు కూడా ఉంటుంది.సాధారణంగా అబ్బాయిలు తమ తల్లి చెంత బిడ్డగా పెరుగుతారు.
అయితే ఎంతో ప్రాణంలా భావించే తల్లి చనిపోతే ఏ కొడుకూ తట్టుకోలేడు.ఇదే తరహాలో ఓ కొడుకు చనిపోయిన తన తల్లిని తలచుకుని కుంగిపోయాడు.
చివరికి తల్లి లేకుండా బతకలేనని అతడికి అర్థం అయింది.దీంతో తన తల్లి ఎప్పుడూ తన కళ్ల ముందే ఉండాలని భావించాడు.
అనుకున్నదే తడవుగా తన ప్లాన్ అమలు చేశాడు.అచ్చు గుద్దినట్లు తన తల్లిని పోలి ఉండే మైనపు విగ్రహాన్ని చేయించాడు.
దానిని ఇంట్లో ప్రతిష్టించాడు.రోజూ ఆ విగ్రహానికి పూజలు చేసి, తల్లి పట్ల తన ప్రేమను చాటుకుంటున్నాడు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఒక కుమారుడు తన ఇంట్లో మరణించిన తల్లిని పంచలోహ విగ్రహంగా తయారు చేయించుకున్నాడు.
కర్నాటకలోని గదగ్ జిల్లా గగేంద్రగడ తాలూకాలోని లక్కలకట్టి గ్రామానికి చెందిన దేవన్న ఒక లెక్చరర్.ఆయన తల్లి శివగంగమ్మ వృద్ధాప్య అనారోగ్యంతో గత ఏడాది తన 90వ ఏట మరణించారు.
ఒక లెక్చరర్ అయినప్పటికీ, ఎంతో మందికి విద్యాబుద్ధులు చెప్పేవాడైనా తన తల్లి విషయంలో దేవన్న చిన్న పిల్లాడిలా మారిపోయాడు.తన తల్లి మరణించిన తర్వాత చాలా రోజులు నిరాశకు గురయ్యాడు.
ఆమెను అస్సలు మరిచిపోలేక పోయాడు.ఆమె జ్ఞాపకార్థం విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నాడు.బెంగళూరుకు చెందిన మురళీధర్ ఆచార్య రూపొందించిన ఫైబర్ విగ్రహానికి సుమారు రూ.3 లక్షలు, హొన్నప్ప ఆచార్య రూపొందించిన పంచలోహ విగ్రహానికి మరో రూ.95 వేలు వెచ్చించారు.వాటిని ఇంట్లోనే ప్రతిష్టించారు.
వాటికి పూజలు చేస్తూ, తల్లి తనతోనే ఉందనే అనుభూతికి లోనవుతున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy