పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న బట్టి విక్రమార్క తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జమ్మికుంట మండలంలోని బిజ్గిర్ షరీఫ్ దర్గాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకప్రార్ధనలు చేశారు.

రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అప్పుడే రాష్ట్ర ప్రజలకు సమన్యాయం జరుగుతుందని వారన్నారు.

ఈ కార్యక్రమలో సోషల్ మీడియా రాజునాయక్, షకీల్ ,బిపేట రాజు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News