ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ గా రాంచందర్ - విధుల్లో చేరిన నూతన తహాసిల్దార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల నూతన తహశీల్దార్ గా శుక్రవారం రాంచందర్( Ramchander ) నియమితులయ్యారు.

ఎల్లారెడ్డి పేట మండల తహశీల్దార్ గా విధులు నిర్వహించిన జయంత్ కుమార్( Jayant Kumar ) కు బదిలీ అయినా ఉత్తర్వులు ఇంకా వెలువడ లేదని తెలిసింది.

ఆదిలాబాద్ జిల్లా నుండి ఎల్లారెడ్డి పేట( Yellareddypet ) కు బదిలీ పై వచ్చిన రాంచందర్ శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు.బుదవారం నాడే విధుల్లో చేరాల్సి ఉండగా అమావాస్య ఉండగా శుక్రవారం నెల పొడుపు కావడంతో పురోహితుని అడిగి ఆశీర్వచనం తీసుకుని విధుల్లో చేరారు.

కాగ సోమవారం నుండి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనున్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News