కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు నష్టం జరగకుండా చూడాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రము లో రైతుల సమస్యల పై బీజేపీ దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మాట్లాడుతూ మండలం లోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు 5 నుండి 10రోజులు అవుతున్న ఇంకా కూడా తూకం వేయడం లేదు రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇప్పటికి అయిన మేలుకొని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా వడ్ల రాసులు అకాల వర్షాలతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది.

ఇప్పటికి అయినా వెంటనే కొనుగోలు ప్రారంభించిన రైతులకు నష్టం జరగకుండా చూడాలి లేని పక్షం లో రానున్న రోజుల్లో రైతుల పక్షాన తీవ్ర ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News