త్రాగునీటి సౌకర్యం కోసం బోరు మోటారుకు ఎంపీ నిధులు మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ ల్యాండ్స్ నుండి మద్దిమల గ్రామానికి త్రాగు నీరు సౌకర్యం బోరు కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందనీ మండల బిజెపి నాయకులు తెలిపారు.

అనంతరం బీజేవైఎం మండల అధ్యక్షులు బండారు మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు బోరు వేయడం జరిగిందన్నారు .

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాలోత్ లక్ పతి నాయక్, బట్టు పీరయ్య, బానోత్ శ్రీనివాస్ నాయక్, బోడ వెంకటేష్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు

Latest Rajanna Sircilla News