మంగళవారం వేములవాడ నియోజకవర్గం లో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటన భాగంగా ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.

వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

పర్యటన వివరాలు:

ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ జంక్షన్ ను ప్రారంభిస్తారు.ఉదయం 10:30 గంటలకు చింతలతండా గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటుచేసిన 42 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు.ఉదయం 11 గంటలకు జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, డి ఈ ఐ సి సెంటర్, మాతృసేవా సెంటర్ ను ప్రారంభిస్తారు.

ఉదయం 11:15 గంటలకు జిల్లా ఆసుపత్రి ఆవరణంలో బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభిస్తారు.ఉదయం 11:30 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12 గంటలకు మూల వాగు వద్ద అత్యాధునిక అంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు శ్యామకుంట జంక్షన్ వద్ద వెజ్ మార్కెట్ ను ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12:45 గంటలకు గుడి చెరువు అభివృద్ధి పనులకు, శివార్చన స్టేజికి శంకుస్థాపన చేస్తారు.మధ్యాహ్నం 1 గంటలకు బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

Advertisement

మద్యాహ్నం 1:30 గంటలకు భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లంచ్.

మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బందు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.

Advertisement

Latest Rajanna Sircilla News