పవన్ కళ్యాణ్ కిరాయి పొలిటీషియన్ - మంత్రి అంబటి రాంబాబు

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పట్టణ సచివాలయల కన్వీనర్లు, వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం.మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.

కందుకూరులో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు చాలా దుర్మార్గమైన అంశం.కార్యకర్తల కోసం 2 నిముషాలు మౌనం.

చంద్రబాబు నాకు జనం బాగా వస్తున్నారని చూపించుకోవాలని ఇరుకు సందులో మీటింగ్ పెట్టి 8 మంది చనిపోవడానికి కారణమయ్యారు.గ్రాఫ్ పడిపోతుందని ఇరుకు సందులో మీటింగ్ పెట్టి జనం ఎక్కువ మంది వచ్చారని చూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

ఇదేమి ఖర్మ కార్యక్రమం పెట్టిన టీడీపీ ఈ రాష్ట్రంలో భూ స్థాపితం కాక తప్పదు.జగన్మోహనరెడ్డి ని కలిసి కట్టుగా ఓడించాలని చూస్తున్నారు అది ఎప్పటికి జరగదు.

Advertisement

అంబటి కాపుల కొంపల్లో కుంపటి అని అంటున్నారు.చంద్రబాబు దగ్గర కిరాయి తీసుకున్న పొలిటిషన్ పవన్ కళ్యాణ్.

శవాల దగ్గర పేలాలు ఏరుకున్నాను అంటున్నారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన టీడీపీ నాయకులే శవాల దగ్గర పేలాలు ఏరుకున్నారు నేను కాదు.కాపుల గుండెల్లో కుంపటి కాదు పవన్ కళ్యాణ్ కాపులకు పట్టిన శని.సైకో బ్యాచ్ కొట్టుకున్నారు సైకిల్ బ్యాచ్ తిట్టుకున్నారు.కిరాయి తీసుకున్న డబ్బులో 50 లక్షలు ఇవ్వండి బుద్దుంటే.

మేము కిరాయి రాజకీయాలు చేసేవాళ్ళం కాదు.

నాగబాబు కూడా నన్నేమి చేయలేడు నాకు మీ ఆశీస్సులు వున్నంతవరకు.పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఒక్కచోట గెలువు ఎవరి సపోర్ట్ లేకుండా చూద్దాం.పార్టీ పెట్టి డబ్బులు ఏరుకుంటున్న రకం పవన్ కళ్యాణ్.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

సినిమాల్లో డబ్బులు సంపాదించి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే పవన్కళ్యాణ్ నన్ను విమర్శించే స్థాయి కాదు.కిరాయికి మాట్లాడే మనోహర్ కి బుద్ధి చెప్పండి.

Advertisement

పవన్ కళ్యాణ్ కిరాయి పొలిటీషియన్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి చెవిలో చెబితే కాపులకు నాకు గొడవ పెట్టడానికి వచ్చాడు.

కాపులకు పట్టిన శని పవన్ కళ్యాణ్.పవన్ కళ్యాణ్ కిరాయి రాజకీయ నాయకుడు అయితే మనోహర్ కమిషన్ తీసుకునే వ్యక్తి.

కిరాయి రౌడీల పార్టీ జనసేన పార్టీ.పవన్ కళ్యాణ్ పిచ్చిపిచ్చిగా ఎక్కువ మాట్లాడితే సమాజం చూస్తూ ఊరుకోదు.

చంద్రబాబు నాయుడు గ్రాఫ్ రోజు రోజుకి పడిపోవడంతో ఇరుకు సందులో మీటింగ్ పెట్టి జనం వస్తున్నారని బిల్డప్ ఇస్తున్నాడు.ఇరుకు సందులో చంద్రబాబు మీటింగ్ పెట్టి ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు.

తాజా వార్తలు