తీర్థంతో పాటు దేవుడి విగ్రహాన్ని మింగేశాడో భక్తుడు.. మామూలుగా లేదుగా!

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజూ దేవుడికి పూజ చేయడం, గుడికి వెళ్లడం, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం అలవాటే.అయితే చాలా మంది దేవుడి ధ్యాసలో పడి అన్నీ మర్చిపోతుంటారు.

 Man Swallowed Krishna Ido At Karntaka  Krishna Idol, Man Swallowed , Karntaka-TeluguStop.com

మరికొందరేమో దేవుడిపై కంటే అక్కడ ఇచ్చే ప్రసాదాలపైనే మక్కువ చూపిస్తుంటారు.అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఓ వ్యక్తికి చిన్నప్పటి నుంచి శ్రీ కృష్ణుడు అంటే ఇష్టం అంట.ప్రతిరోజూ కృష్ణ పూజ చేస్తూ.జీవితాన్ని గడుపుతున్నాడు.

అయితే అదే ఆయ పాలిట శాపంగా మారింది.పూజ ధ్యాసలో పడి తానేం చేస్తున్నానో కూడా గ్రహించకుండా ఓ పెద్ద సమస్యను తెచ్చుకున్నాడు.

అయితే ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బెళగావికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తుడు.

రోజూ ఆ పరమాత్ముడికి పూజ చేయనిదే బయట అడుగు కూడా పెట్టడు.అయితే ఓ రోజు స్వామి వారికి అభిషేకం చేసి.

ఆ పంచామృతాన్ని తీర్థంగా తీసుకున్నాడు.కానీ అందులో ఉన్న బాల కృష్ణుడి విగ్రహాన్ని కూడా తీర్థంతో పాటు మింగేశాడు.

అది లోపలికి వెళ్లినట్లు అతడికి కూడా తెలియదు.కానీ ఆ విగ్రహం గొంతులో ఇరుక్కుపోవడంతో… విపరీతమైన నొప్పి కల్గింది.

ఏం జరిగిందో తెలియక భయపడుతుంటే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.స్కాన్ చేసి చూసి కనిపించి విగ్రహాన్ని చూసి షాకయ్యారు.

వెంటనే కేఎల్ఈఎస్ ఆస్పత్రి సిబ్బంది ఎండోస్కోపి పరీక్షలు చేసి ఆహార నాళికలో ఇరుక్కుపోయిన విగ్రహాన్ని శస్త్ర చికిత్స ద్వారా తొలిగంచారు.ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.

కానీ ఈ శస్త్ర చికిత్స చాలా క్షిటమైనదని.కానీ అష్టవశాత్తు సక్సెస్ అయి అతడు బతికి బయట పడ్డాడని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube