హాంకాంగ్‌: వణికిస్తున్న నేకెడ్ వీడియో చాట్ స్కామ్‌.. ఎన్నారైలకూ రిస్కే..

ఈరోజుల్లో సైబర్ క్రైమ్స్‌(Cyber ​​crimes ) బాగా పెరిగిపోతున్నాయి.ఎవరూ ఊహించని విధంగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు.

రీసెంట్ గా హాంకాంగ్( Hong Kong) లో ఒక పెద్ద స్కామ్‌ బయటపడింది.పోలీసుల ప్రకారం, ఒక వారంలోనే 59 మంది (55 మంది పురుషులు, 4 మంది స్త్రీలు) నేకెడ్ చాట్ బ్లాక్‌మెయిల్ స్కామ్‌కు బలి అయ్యారు.ఈ కేటుగాళ్లు సోషల్ మీడియాలో స్నేహితులుగా నటిస్తూ, వీడియో చాట్‌లలో దుస్తులు విప్పమని బలవంతం చేసి, ఈ వీడియోలను ఉపయోగించి డబ్బులు కోరుతూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.

ఈ వీడియోలను ఇంటర్నెట్‌లో లేదా బాధితుల కుటుంబాలకు పంపిస్తామని బెదిరిస్తున్నారు.

ఈ మోసగాళ్ల బెదిరింపులకు భయపడి బాధితులు రూ.2 కోట్లకు పైగా డబ్బులు చెల్లించారు.ఈ రకమైన మోసాల గురించి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.

కొంతమంది మోసగాళ్లు చాలా తెలివైన వారుగా, డబ్బున్న వారుగా, ఆకర్షణీయంగా ఉన్నట్లు నటిస్తూ, చాలా మందిని మోసం చేశారు.వీడియో కాల్స్‌లో బాధితులను దుస్తులు విప్పమని బలవంతపెట్టి, ఆ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు.

ఆ తర్వాత ఆ వీడియోలను బయటపెడతామని బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని బలవంతం చేశారు.

ఈ మోసగాళ్లు మొదట బాధితులతో చాలా స్నేహంగా మాట్లాడి, వారి గురించి అన్ని విషయాలు తెలుసుకుని, ఆ తర్వాత వారిని నమ్మించి మోసం చేశారు.ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే 1,102 మంది నేకెడ్ చాట్ బ్లాక్‌మెయిల్‌కు నష్టపోయారు.వీరిలో ఐదో వంతు మంది విద్యార్థులు.

వీరిలో కొందరు 11 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు.ఈ మోసగాళ్లు బాధితుల నుంచి మొత్తం 34.94 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారు.హాంకాంగ్‌లో కోవిడ్-19 తర్వాత ప్రజలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు.అందుకే ఇంటర్నెట్ సంబంధించిన నేరాలు పెరిగాయి.2023లో 15,637 కేసులు నమోదయ్యాయి.ఈ నేరాల వల్ల 2,291 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగింది.2024లో ఈ సంఖ్య మరింత పెరిగి 16,182 కేసులు నమోదయ్యాయి.ఈ నేరాల వల్ల 2,997 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ రేమండ్ లామ్ చెక్-హో తెలిపారు.

ఇక్కడ నివసిస్తున్న ఎన్నారైలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు