112 మంది నిరుపేదలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన గుత్తా

నల్లగొండ జిల్లా: ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) పథకం నిరుపేదలకు వరంలాంటిదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని గుత్త సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 112 మంది నిరుపేద ప్రజలకు సిఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన రూ.

36,26,500/- విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు.

నిరుపేద ప్రజలకు ఆర్ధిక సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

మా దందా మాదంటున్న నాంపల్లి వైన్స్ యాజమాన్యం
Advertisement

Latest Nalgonda News