కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది.పండుగలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.
ఈ సందర్భాలలో వివిధ రకాల సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల దేవస్థానం వెల్లడించింది.
మార్చి 3వ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు జరగనున్నాయి.
రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మార్చి మూడున శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారి పుష్కరిణిలో మూడుసార్లు విహరించి భక్తులకు కనువిందు చేస్తారు.

రెండవ రోజు మార్చి 4న రుక్మిణి సమేత శ్రీ శ్రీకృష్ణుడి అవతారంలో మూడుసార్లు పుష్కరిణిలో తిరుగుతారు.ఇక మూడవరోజు మార్చి ఐదున శ్రీ భూ సమేత మల్లయప్ప స్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తుల కు అనుగ్రహిస్తారు.ఇదే విధంగా శ్రీ మల్లయ్య స్వామి వారు నాలుగవ రోజు మార్చి ఆరవ తేదీన ఐదు సార్లు, చివరి రోజు మార్చి 7వ తేదీన ఏడుసార్లు తెప్ప పై పుష్కరిణిలో విహరించి భక్తులకు కనువిందు చేస్తారు.అయితే ఈ తెప్పోత్సవాల కారణంగా పలు సేవలను రద్దు చేశారు.
మార్చి 3,4 తేదీల్లో తోమాల, శివ అర్చన, సహస్ర దీపాలంకరణ సేవ మార్చి 5, 6 తేదీల్లో తోమాల సేవ, అర్చన అర్చన, అర్జిత బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు.సహస్ర దీపాలంకరణ సేవా మార్చి 7న అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
LATEST NEWS - TELUGU