సెస్ ఏ ఈ కి ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీటీసీ

ఎల్లారెడ్డిపేట కు అదనంగా మరో హెల్పర్ నియామకం.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట కు అదనంగా మరో హెల్పర్ రమేష్ ను నియమించినట్లు సెస్ ఏ ఈ పృథ్విదర్ తెలిపారు.

సెస్ ఏ ఈ పృథ్విదర్ కు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.ఎల్లారెడ్డిపేటలో ఎనిమిది వేల గృహ విద్యుత్ కనెక్షన్ లు ఉన్నాయని ఇంత పెద్ద గ్రామానికి ఒక్కరే హెల్పర్ ఉండడం వల్ల గృహా వినియోగదారులు రైతులు ఎదుర్కొంటున్నారనీ ఇటీవల సెస్ ఏ ఈ పృథ్వీ దర్ ను మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ కరెంట్ సమస్యలను వివరించగా సానుకూలంగా స్పందించిన సెస్ ఏ ఈ పృథ్వీదర్ ఎల్లారెడ్డి పేట మండలంలోని పదిర గ్రామంలో హెల్పర్ గా పనిచేస్తున్న ఆకుల రమేష్ ను ఎల్లారెడ్డి పేట హెల్పర్ గా బదిలీ చేశారు.

పదిర , హరిదాస్ నగర్ గ్రామాలకు జలపతి అనే హెల్పర్ ను నియమించారు.

Advertisement

Latest Rajanna Sircilla News