దాతల సహకారంతో 1224 రోజులుగా పేదలకు అన్నదాన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా : దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో 1224 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, భక్తులకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వర రావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కుమారులు కోడళ్లు రామడుగు ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, రామడుగు శిరీష సాయిచంద్ర దంపతులు, రామడుగు శర్వాణి రవిచంద్ర దంపతులు ఉన్నారని, అన్నదానానికి శాశ్వత సభ్యత్వం పొందే వారు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మహేష్ కోరారు.

నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్, సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News