తెలంగాణలో తుది దశకు ఎన్నికల ప్రచారం..!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది.మరి కొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనుంది.

 Election Campaign In Telangana To Its Final Stage..!-TeluguStop.com

ఇవాళ సాయంత్రం 5 గంటలతో ప్రచారం గడువు ముగిస్తుంది.

ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రానుంది.

ఈ క్రమంలో స్థానికేతరులు అంతా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు చివరి రోజు కావడంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.వరుసగా సభలు, సమావేశాలతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా ప్రచారం క్లైమాక్స్ కు చేరిన నేపథ్యంలో పార్టీలన్నీ పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టనున్నాయని తెలుస్తోంది.ఈనెల 29, 30 తేదీల్లో భారీగా మద్యం, డబ్బులు పంపిణీ జరిగే అవకాశం ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే నియోజకవర్గాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది.ఇప్పటికే ఈసీ నిఘా బృందాలు, ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగారు.

ఇక ఎల్లుండి తెలంగాణలో పోలింగ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube