కరోనా వ్యాక్సిన్ వికటించి మరో అంగన్‌వాడీ టీచర్ మృతి..!!

దేశంలో కరోనా వైరస్ అందుబాటులోకి వచ్చాక ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

ఈ గ్రామంలో దేశంలో పలుచోట్ల వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య సిబ్బందికి అదేవిధంగా అంగన్‌వాడీ వర్కర్లకు వికటించి మృతిచెందిన సందర్భాలు ఇటీవల మనం చూశాం.తాజాగా కడప జిల్లా పులివెందులలో ఇదే రీతిలో అంగన్‌వాడీ టీచర్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత మృతి చెందటం కలకలం గా మారింది.  పులివెందుల పట్టణం అహోబిలాపురంలో నివాసముంటున్న టి.నారాయణమ్మ(58) అనే అంగన్‌వాడీ టీచర్‌ రెండు వారాల క్రితం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది.వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం.

ఆమెకు రెండో రోజు జ్వరం రావడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకోవటం జరిగింది.ఈక్రమంలో వైద్యులు టైఫాయిడ్ జ్వరం గా గుర్తించి.

కడప రిమ్స్ కు తరలించారు.అక్కడ ఆమెకు జ్వరం తగ్గక పోవటంతో.

Advertisement

కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చిన గంటలో ఆమె మృతి చెందటంతో.వ్యాక్సిన్ వికటించి ఆమె మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

  దీంతో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనేసరికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు