శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో ఉండకూడదు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో ఆడేపు రమ్య కు చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుని నివాస యోగ్యం గా లేక ఇల్లు కులీపోతుండంతో అట్టి ఇల్లు ను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ పరిశీలించారు.

ఇట్టి ఇంటిలో ఉండకుండా వేరే ఇంట్లో ఉండాలని ఆడెపు రమ్య కు ఆమె భర్త గణేష్( Ganesh 0 కు సూచించారు.

ఇల్లు శిథిలావస్థకు చేరిన విషయం ను మండల తహశీల్దార్ జయంత్ కుమార్ ( Jayant Kumar )దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని అన్నారు.వీలైతే గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు.

ఆయన వెంట వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News