విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ లు పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ( Pratapa Ramakrishna ) జన్మదినోత్సవం సందర్భంగా వేములవాడ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుకు గ్రామాలనుండి వస్తున్న 100 మంది విద్యార్థినులకు ఆర్టీసీ బస్ పాస్ లను సంవత్సర కాలనికి ఉచితంగా అందించడం జరిగింది అట్టి బస్ పాస్ లను ప్రతాప రామకృష్ణ గారి తరుపున బిజెపి నాయకులు రేగుల సంతోష్ బాబు, బిళ్ల కృష్ణ, నామాల శేకర్, సగ్గు రాహుల్, కీసరి యశ్వంత్, వంగపల్లి హరీష్, బిజెపి నాయకులు విద్యార్థినులకు అందజేశారు.

పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుహాసిని, విద్యాశాఖ జిల్లా సెక్టరియల్ అధికారి పద్మజ, ఆర్టీసీ డి మ్ మురళీకృష్ణ, పీ ఆర్వో శ్రీనివాస్ యాదవ్, పాటశాల మరియు ఆర్టీసీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News