ఇవాళ టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కీలక సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ ఎంపీలతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నారు.

ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది.డిసెంబర్ 4 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే అజెండాగా సమావేశం నిర్వహించారు.అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు.

అనంతరం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.ఈ క్రమంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.

Advertisement
తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో నటించిన స్టార్ హీరో ఈయన ఒక్కడేనా..?

తాజా వార్తలు