వారణాసిని గంగలో కలిపేస్తున్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా బాలయ్య అఘోరా పాత్రలో కనిపించి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ఈ అఘోరా పాత్రకు సంబంధించి ఓ ముఖ్యమైన సీక్వెన్స్ వారణాసిలో షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.

కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి.దీంతో ఈ వారణాసి సీక్వెన్స్‌ను మార్చి రాస్తున్నాడట బోయపాటి.

Advertisement

ఈ మార్చిన సీక్వెన్స్‌ను బాలయ్యకు వినిపించి, ఓకే చేయించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి కరోనా కారణంగా బాలయ్య సినిమా షూటింగ్‌లోనే కాకుండా సినిమా కథలో కూడా మార్పులు జరుగుతున్నాయి.

మరి బాలయ్య సినిమాలో బోయపాటి మార్చిన ఆ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే తిరిగి ప్రారంభించాలని బాలయ్య అండ్ టీమ్ భావిస్తున్నారు.

జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?
Advertisement

తాజా వార్తలు