తపాలా పథకాలపై వెల్జీపూర్ గ్రామా ప్రజలకు కు అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం మండలం, వెల్జీపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో తపాల శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని తపాలా శాఖ సిరిసిల్ల సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గజ్జల వేణు నిర్వహించారు.

ఈ సందర్భంగా తపాలా అధికారులు మాట్లాడుతూ గ్రామా ప్రజలు పొదుపు అలవాటు చేసుకోవాలని అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

అందుకోసం తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ,ఉడుతల రజిత ,ఉడుతల వెంకటేష్ , తపాలా శాఖ మెయిల్ ఓవర్సీర్ సాయిరాం,వెల్జీపూర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సంజీవ్, ఇతర తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి - కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా

Latest Rajanna Sircilla News