వైరల్: పుష్ప మ్యానరిజం వాడుకొని టీమిండియాను వెక్కిరించిన ఆసీస్‌ అభిమాని?

బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీ 23లో భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న 2వ టెస్టులో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

దాంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

భారత్ ఆట తీరు ఎలావున్నా, తమ అభిమాన హీరో స్టైల్ ఖండాంతరాలు దాటిందని తెగ సంబరపడిపుతున్నారు.వివరాల్లోకి వెళితే.

శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాను కేవలం 263 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ చేసింది.అయితే ఆ తరువాత బ్యాటింగ్‌లో టీమిండియా కష్టాలు పడుతోంది.

వెంటవెంటనే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది భారత్.తొలుత KL రాహుల్‌ను నాథన్‌ లయన్‌ లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ చేసేశాడు.నాథన్‌ తన మరుసటి ఓవర్‌లోనే మరో 2 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ రెండో బంతికి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్లీన్‌ బౌల్డ్‌ అయిపోయాడు.ఇలా 54 పరుగులకే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

ఆ తర్వాత మరికొద్ది సేపటికే శ్రేయస్‌ అయ్యర్‌ అవుట్‌ కావడంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి గడ్డు అపరిస్తితుల్లో పడింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అభిమానులు ఫుల్‌ జోష్‌లో కనిపించారు.అయ్యర్‌ వికెట్‌ పడగానే.ఓ ఆస్ట్రేలియన్‌ అభిమాని పుష్ప సినిమాలోని "అల్లు అర్జున్‌" మ్యానరిజం గడ్డం కింద చేయి పోనిచ్చి.

తగ్గేదేలే అంటూ టీమిండియాను పుండు మీద కారం జల్లినట్టు వెక్కిరించాడు.తొలి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం అనే కసి వారిలో స్పష్టంగా కనిపించింది.కాగా అతను పుష్ప మ్యానరిజం ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

ఈ ఘటన క్రికెట్‌ అభిమానులకు కష్టంగా వున్నా, బన్నీ అభిమానులను మాత్రం ఖుషి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు