మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై మంత్రి పువ్వాడ అది తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
డబ్బు బలం చూసుకుని పొంగులేటి విర్ర వీగుతున్నారని అజయ్ మండిపడ్డారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జెడిఎస్ లకు కెసిఆర్ నిధులు సమకూర్చారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణకు సుప్రీం వెకేషన్ బెంచ్ నిరాకరించింది.
త్వరలోనే రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నానని, ఏపీ సీఎం జగన్ సమక్షంలో మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఈరోజు మృతి చెందారు.
జి 20 సదస్సులో ఫిలిం టూరిజం, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటు అయిన 17 దేశాల సభ్యులు ఉన్న ప్యానల్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
9 ఏళ్ల పాలనలో కెసిఆర్ కు బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని తెలంగాణ ప్రభుత్వం పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతోనే, కేసీఆర్ బీసీల ప్రస్తావన తీసుకువచ్చారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారు.దీనిపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.కడప జిల్లాలో గాలి బీభత్సనికి ఒకరు మరణించారు.
వైసిపి పాలనలో అక్రమాలు, అరాచకాలు పెరిగాయని ,జగన్ పాలనపై త్వరలోనే చార్జిషీట్ విడుదల చేస్తామని బిజెపి నేత విష్ణుకుమా రాజు అన్నారు.
ఏపీ పి టి డి ఎంప్లాయిస్ యూనియన్ 27వ మహాసభ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ పనిచేస్తున్నారని, ప్రతిరోజు ఒక కంపెనీ వచ్చేలా కృషి చేస్తున్నారని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రశంసించారు ఇక ఏపీ రాజధాని ఏది అంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని కేసీఆర్, కేటీఆర్ లను చూసి నేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వంపై చంద్రశేఖర్ విమర్శలు చేశారు.
బందరు పోర్ట్ నిర్మాణానికి ఈరోజు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
2000 నోటు రద్దు నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ పనిచేశారని ఆ కుటుంబంపై మోడీ కక్ష సాధిస్తున్నారని సిపిఐ నారాయణ విమర్శించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.రేవంత్ రెడ్డి వచ్చినా ఆయన బిజెపిలో చేర్చుకోమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
టీ పీసీసీ విస్తృత సమావేశం నేడు గాంధీభవన్ లో జరగనుంది.దీనికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ,-56,290 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -;61,310 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy