అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న యాంకర్!

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక మరణవార్త విని ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే మరణ వార్త వినిపిస్తూనే ఉన్నాయి.

కొన్ని రోజుల వ్యవధిలోనే మొదట కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్, అనంతరం సిరివెన్నెల సీతారామశాస్త్రి, అలాగే హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.అయితే ఈ బాధల నుంచి ఇంకా కోలుకోకముందే తాజాగా ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది.

జబర్దస్త్ యాంకర్ అనసూయ తండ్రి మధుసూదనరావు మరణించారు.దీంతో ఒక్కసారిగా యాంకర్ అనసూయ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో, క్యాన్సర్ తో బాధపడుతున్న మధుసూదన రావు తాజాగా తుది శ్వాస విడిచారు.ఇతను గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక అనసూయ తండ్రి మరణవార్త తెలిసిన పలువురు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.

తార్నాకలో ఈ సంఘటన చోటు చేసుకోగా, అనసూయ తన షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకుని తార్నాక వెళ్లారని సమాచారం.ఇక అనసూయది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే.అనసూయ ప్రేమ వివాహానికి తన తండ్రి మధుసూదన రావు తీవ్రంగా వ్యతిరేకించారట.

దాదాపుగా 5 ఏళ్లకు పైగా అసలు ఎదురు చూసి చివరికి తన తండ్రి అనుమతితో భరద్వాజ్ ని వివాహం చేసుకున్నాను అని గతంలో అనసూయ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.ఇక ప్రస్తుతం అనసూయ బోలెడు సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.

ఇక తండ్రి మరణవార్త తెలియగానే అనసూయ కుంగిపోయారని తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు