"రేపా" ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయునికి ఆత్మీయ సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన కనమేని ఎల్లారెడ్డి సింగారం గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఎల్లారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట రేపా ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఆత్మీయ సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో రేపా కన్వీనర్ మోతే దేవా రెడ్డి ,కో కన్వీనర్ ముత్యాల వెంకటరెడ్డి, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, యమగోండ బాల్ రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి ,కోల బాపురెడ్డి , తాడ ప్రభాకర్ రెడ్డి, మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, పారిపెల్లి రామ్ రెడ్డి, పాతూరి రామేశ్వర్ రెడ్డి, దడిగెల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు

Latest Rajanna Sircilla News