ఓ వ్యక్తి అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఉత్తర్ల రాజేందర్ (55 ) ( Uttarla Rajender )అనే వ్యక్తి అదృశ్యం పై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ రామాకాంత్ తెలిపారు.

హారిదాస్ నగర్ గ్రామానికి చెందిన రాజేందర్ అనే మేస్త్రీ జూన్ నెలలో చీరలవంచకు పనిమీద వెళ్లి వస్తానని మూడు నెలలైనా తిరిగి రాలేదని ఆచూకీ దొరకడం లేదని అతని భార్య రేణవ్వ ఎస్ ఐ కి పిర్యాదు చేసింది.

కుటుంబ సభ్యులు బంధువుల ఇండ్లలో చుట్టుపక్కల వారి ఇండ్లలో వెతకగా అతని ఆచూకీ లభించకపోవడంతో చివరకు ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కి ఫిర్యాదు చేసింది ఆమే పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

Latest Rajanna Sircilla News