శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.
ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.
క్యూలైన్లో పలువరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువరు భక్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.
టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.