తెలుగులో ప్రముఖ దర్శకుడు “పార్థ సారధి” దర్శకత్వం వహించిన “కాంచనమాల కేబుల్ టీవీ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కర్ణాటక బ్యూటీ “లక్ష్మీ రాయ్” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు అందరిలాగే సినిమా పరిశ్రమకి తన నటనా ప్రతిభను నిరూపించుకుని స్టార్ హీరోయిన్ కావాలని ఎన్నో కలలతో ఆశలతో సినిమా పరిశ్రమకు వచ్చింది.
ఇందులో భాగంగా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఎందుకో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.
దీనికి తోడు ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం పాత్రలు గెస్ట్ అప్పియరెన్స్, కామియో అప్పియరెన్స్, స్పెషల్ సాంగ్స్ తరహాలో ఉండటంతో ఈ అమ్మడు గుర్తింపుకు నోచుకోక లేకపోయింది.
దీంతో ఇప్పటి వరకు తన సినీ కెరీర్లో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో అవకాశాలు దక్కించుకోవడంలో కొంతమేర శ్రమించాల్సి వస్తోంది.కాగా లక్ష్మీ రాయ్ అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో పెంచేస్తోంది.
ఆ మధ్య బీచ్ లో బికినీ దుస్తులు ధరించిన ఫోటోలను ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ద్వారా లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
చక్కని ముఖ కవళికలు అందం, అభినయం, నటనా ప్రతిభ మెండుగా ఉన్నటువంటి లక్ష్మీరాయ్ తన చిత్రాల కథల విషయంలో మరియు పాత్రల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడమే ఆమె కెరీర్ కి మైనస్ అయ్యిందని, అందువల్లే రాయ్ లక్ష్మి స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని కొంతమంది సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా లక్ష్మీ రాయ్ ప్రస్తుతం ఒకపక్క పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే మరో పక్క స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది. కాగా ప్రస్తుతం కన్నడలో “ఝాన్సీ ఐపీఎస్” అనే చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తుంది.
అలాగే తెలుగులో నూతన దర్శకుడు బాలాజీ దర్శకత్వం వహిస్తున్న “ఆనంద భైరవి” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.కాగా ఇటీవలే తమిళ ప్రముఖ దర్శకుడు వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న టువంటి “సిండ్రెల్లా” అనే చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అయితే ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జోనర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.