యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గురువారం ఎపిసోడ్ కు స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ గా హాజరయ్యారు.ఈ షోలో ప్రత్యూష ఫౌండేషన్ కోసం ఆడిన సమంత ఏకంగా 25 లక్షల రూపాయలు గెలుచుకోవడం గమనార్హం.దసరాను నా స్నేహితులు సెలబ్రేట్ చేసుకుంటారని ఉదయం 4.30 గంటలకు నిద్ర లేచి పూజా కార్యక్రమాలలో పాల్గొంటానని సమంత తెలిపారు.ఎన్టీఆర్ సమంత గాలి తిని బ్రతుకుతోందని కామెంట్ చేయగా తనకు స్ట్రెంత్ ఉందని సమంత బదులిస్తారు.
ఎన్టీఆర్ సమంతను నువ్వు క్విజ్ యాప్స్ ను బాగా డౌన్ లోడ్ చేసుకొని ఆడతావని విన్నానని చెప్పగా చాలారోజుల ముందు తాను డౌన్ లోడ్ చేసుకుని ఆడేదానినని ఇప్పుడు కామ్ అయ్యానని సమంత తెలిపారు.
ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా 500 మంది పిల్లలకు సహాయం చేశామని కరోనా వల్ల చాలామంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని సమంత చెప్పుకొచ్చారు.సాధారణ సెలబ్రిటీలు మూడు లైఫ్ లైన్స్ వాడుకోవచ్చని సమంత మాత్రం రెండు లైఫ్ లైన్స్ వాడుకోవాలని ఎన్టీఆర్ చెబుతాడు.
ఎన్టీఆర్ అలా చెప్పడంతో నేనేం తప్పు చేశానంటూ సమంత ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తుంది.
క్వశ్చన్స్ కంటే సెట్ లైట్ చూస్తేనే భయంగా ఉందని సమంత చెబుతారు.నాకు ఇప్పటికే వయసైపోయిందని కొంచెం స్లోగా చెప్పాలని సమంత ఎన్టీఆర్ వాయిస్ గురించి కామెంట్లు చేస్తారు.ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమంత వేగంగా సమాధానాలను చెప్పేస్తారు.
ఎన్టీఆర్ కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించగా తాను ఇప్పటికే కన్ఫ్యూజన్ లో ఉన్నానని సమంత పేర్కొన్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ క్వశ్చన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు అడగగా సమంత తారక్ చీట్ చేస్తున్నారని చెబుతారు.శకుంతలకు సంబంధించిన క్వశ్చన్ అడగగా నేనే శకుంతల అని సమంత సమాధానం ఇస్తారు.సమంత ఎన్టీఆర్ కలిసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.