భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదును ప్రారంభించిన రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేకతలపై బీఆర్ఎస్ వి పోరాటం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లను, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం చాలా దురదృష్టమని, విద్యార్థి సమస్యలపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాటం చేస్తున్న భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగమని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు.విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అండగా ఉంటదని రాబోయే రోజుల్లో అన్ని కళాశాల కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు వేయడం జరుగుతుందని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్విలో చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన కంచర్ల రవి గౌడ్.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, కోడం వెంకటేశం, అనిల్ గౌడ్, సాయి, తిరుపతి, భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.