ప్రపంచవ్యాప్తంగా హజ్ యాత్రలో( Hajj ) భాగంగా చాలా దేశాల నుంచి లక్షలాది ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కా( Mecca ) చేరుకుంటారు.ఈ యాత్రలో ఒక అంశం ఎంతో ప్రధానమైనది.
అదే సైతాన్ ను( Devil ) రాళ్లతో కొట్టడం.ఈ ప్రక్రియ వెనుకున్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హజ్ యాత్రలో సైతాన్ ను రాళ్లతో కొట్టే ప్రక్రియ హజ్ లోని మూడవరోజు జరుగుతుంది.ఆ రోజునే ప్రవచవ్యాప్తంగా చాలామంది ప్రజలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు.
బక్రీద్ రోజు హాజ్ యాత్రికులు ముందుగా మీనా పట్టణం చేరుకుంటారు.అక్కడ వారు సైతాన్ ను మూడుసార్లు రాళ్లతో కొడతారు.
మీన పట్టణంలోని మూడు వేరు వేరు ప్రాంతాలలో నిర్మితమైన వివిధ స్తంభాలను రాళ్లతో కొడతారు.

దీనిలోని మొదటి స్తంభం జమ్రాహె ఉక్వా, రెండవది జమ్రాహె వుస్తా, మూడవ స్థంభం జమ్రాహె ఉలా. ఇస్లాంలో పేర్కొన్న వివరాల ప్రకారం హజ్’లో పాల్గొన్నవారు రాళ్లతో మూడు స్తంభాలను( Three Pillars ) కొడుతారు.ఒకానప్పుడు హజ్రత్ ఇబ్రహీం సైతాన్ ను పారదోలెందుకు ఈ స్థలాలను రాళ్లతో కొట్టారని చెబుతారు.
ఆ సమయంలో హజరత్ ఇబ్రహీం ఆయన కుమారునికి కుర్బానీ ఇచ్చేందుకు వెళ్తుండగా సైతాన్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.అప్పుడు స్తంభాలను సైతాన్ ను ప్రతికూలంగా భావించి రాళ్లతో కొట్టారు.

మొదటి రోజు హాజీ కేవలం మొదటి స్తంభన్ని మాత్రమే కొట్టారు.తదుపరి రోజు తదుపరి రెండు రోజుల్లో మిగిలిన రెండు స్థంభాలను కొట్టారని చెబుతారు.ఈ పవిత్ర యాత్ర చేసే ముస్లింలు( Muslims ) పలు నిబంధనలు పాటిస్తూ ఉంటారు.ఈ యాత్ర చేసే వారు తప్పనిసరిగా ముస్లింలు అయి ఉండాలి.ఈ యాత్రలో పాల్గొనేవారు నిర్మాతరించాల్సి ఉంటుంది ఈ యాత్రలో మహిళలు పాల్గొన్నట్లయితే వారు తల నుంచి పాదాల వరకు కప్పి ఉండే దుస్తులు ధరించాలి.