బీజేపీని తరిమికొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ.. ?

బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి, బీజేపీకి ఒక్క క్షణం కూడ పడదని ఎన్నో సార్లు నిరూపించబడింది.

ఒకరి పై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం లో వెనకడుగు వేయని సందర్భాలు ఎన్నో ఎదురైయ్యాయి.

ఇలాంటి మరో సందర్భం ప్రస్తుతం నెలకొంది.అదేమంటే నందిగ్రామ్ సీటు నుంచి ఎన్నికల బరిలో ఉన్న మమత మంగళవారం అక్కడ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీని పాతరేయండని, నందిగ్రామ్ నుంచే గాక బెంగాల్ నుంచి కూడా ఆ పార్టీని తరిమి కొట్టాలని ప్రజలను కోరుతూ ఎన్నికలలో ప్రశాంతంగా ఓటువేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.ఇకపోతే నందిగ్రామ్‌లో నేటితో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఒకరి పై ఒకరు స్దాయిని మరచి చేసుకుంటున్న విమర్శలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయట.

Advertisement
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

తాజా వార్తలు