ఫోర్బ్స్ మిలీనియర్స్ జాబితాలో చేరిన 8 ఏళ్ల బుడతడు

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మంది దాని ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారు.ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు అదొక ఆదాయ వనరుగా మారిపోయింది.

యుట్యూబ్ వేదికగా కొన్ని వేల చానల్స్ నడుస్తున్నాయి.వాటి ద్వారా లక్షల నుంచి కోట్ల రూపాయిలు ఆదాయాన్ని ఆర్జించే వారు ఉన్నారు.

ఒక సెలబ్రిటీలు అయితే వారికున్న క్రేజ్ తో సోషల్ మీడియాని కూడా తమ ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు.బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ హాట్ ఫోటోల తో ఇన్స్టాగ్రామ్ ద్వారా లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

ఇక కొంత మంది వారు చేసిన వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించి కోట్లు ఆర్జిస్తున్నారు.అలాంటి వారు ఫోర్బ్స్ మిలీనియర్స్ జాబితాలలో కూడా చేరుతున్నారు.

Advertisement

ఇప్పుడు ఓ ఎనిమిదేళ్ళ బుడతడు ఏకంగా ఫోర్బ్స్ మిలీనియర్స్ జాబితాలో చోటు సొంతం చేసుకున్నాడు.కోట్ల రూపాయిల ఆదాయంతో టెక్సాస్‌కు చెందిన ఎనిమిదేళ్ల ర్యాన్ కాజీ అనే బుడతడు ఫోర్బ్స్ లో చేరడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.పుస్తకాలు పట్టుకుని చదువుకునే వయస్సులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న వ్యక్తిగా ఫోర్బ్స్ మేగజైన్‌లో చోటు సంపాదించాడు.2019 సంవత్సరానికిగాను యూట్యూబ్ ద్వారా 185 కోట్లు తన వీడియోల ద్వారా ర్యాన్ కాజీ ఆర్జించాడు.ర్యాన్ కాజీ పేరు మీద వారి తల్లిదండ్రులు మూడేళ్ళ ప్రాయంలో ఒక యుట్యూబ్ చానల్ స్టార్ట్ చేశారు.

అందులో ర్యాన్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన బొమ్మలకి రివ్యూ ఇస్తూ ఉంటాడు.ఈ వీడియోలకి యుట్యూబ్ లో మిలియన్ ఫలోవర్స్ ఉన్నారు.దీంతో ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే యుట్యూబ్ ద్వారా వందల కోట్లు ఆర్జిస్తూ కోటీశ్వరుడుగా మారిపోయాడు.

దీంతో ఫోర్బ్స్ మ్యాగజైన్ లో స్థానం సొంతం చేసుకున్నాడు.

రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?
Advertisement

తాజా వార్తలు