మనదేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు.చాలామంది ప్రజలు రాశి ఫలాలను కూడా బాగా నమ్ముతూ ఉంటారు.
కొన్ని రాశులవారు నవరాత్రులలో చాలా భక్తితో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.ఈ నవరాత్రులను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.
తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు.మామూలు సమయంలో పెద్దగా భక్తి లేకపోయినా, ఈ రాశుల వారు నవరాత్రులలో అమ్మ వారిని భక్తితో పూజిస్తూ ఉంటారు.
కర్కాటక రాశివారు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు.దుర్గాదేవి శక్తి గొప్పది అని వీరు భావిస్తారు.
కాబట్టి నవరాత్రి పండుగ వారికి భగవంతునితో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయంగా భావిస్తారు.ఈ తొమ్మిది రోజులు నిష్టతో పూజలు చేస్తారు.ధనస్సు రాశి వారు నవరాత్రులలో ఈ రాశివారిలో భక్తి ఎక్కువగా ఉంటుంది.ప్రపంచాన్ని అమ్మవారే రక్షిస్తూ ఉంటారని వారు నమ్ముతుంటారు.
ఈ రాశివారు నవరాత్రుల్లో అవసరమైన వారికి సహాయం చేయడంలో ముందుంటారు.మీన రాశి వారి చక్రంలో అత్యంత ఆధ్యాత్మికంగా ప్రసిద్ది చెందారు.
ఆధ్యాత్మికత అనేది వారి అంతర్గత భావాలతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని విరు భావిస్తారు.దేవుడికి మంత్రాలు పఠించడం ద్వారా, వారి సేవలో తమను తాము సమర్పించుకోవడం ద్వారా తమను తాము ఉన్నత వ్యక్తిగా భావిస్తూ ఉంటారు.
సింహ రాశి వారు ఆధ్యాత్మికత పట్ల చాలా ఆశాజనకంగా ఉన్నారు.ఏదైనా పనిలో విజయం సాధించాల్సినప్పుడు వీరు అమ్మవారికి పూజలు చేస్తారు.
ఈ రాశి వారు నవరాత్రి సమయంలో ధ్యానం లేదా మంత్రాలు పఠిస్తూ తమ సమయాన్ని వెచ్చిస్తారు.దేవుణ్ణి ఆరాధించడానికి అందరినీ పిలవాడం కూడా వారికి చాలా ఇష్టం.వృశ్చిక రాశి వారు నవరాత్రులు సమీపించేటప్పుడు, వారు ప్రశాంతంగా ఉంటారు.వారి మానసిక స్థితి చాలా ప్రశాంతంగా మారుతూ ఉంటుంది.వారు మంత్రాలు జపిస్తూ, దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తూ పూర్తి భక్తిభావంతో ఉంటారు.ఇతరులతో కలిసి పండుగను ఎంజాయ్ చేయడం గురించి పట్టించుకోరు.
అమ్మవారిని సేవలో మునిగి పూజలు చేస్తూ,పాపాలు పోతాయి అని వారు భావిస్తారు.