ఈ సంవత్సరం వినాయక చవితి( Lord Vinayaka ) పండుగను సెప్టెంబర్ 19వ తేదీన జరుపుకోబోతున్నారు.ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు.
మరి ఈ పండుగ సందర్భంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగలలో ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.
వినాయక చవితి రోజు ఏమి చేయాలి? ఏలాంటి ఆచారాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పండుగ మొదటి రోజు పూజారి మంత్రాలు పఠించి పూజలు చేస్తారు.
మొదటి రోజు నిర్వహించే ఈ ఆచారలలో వినాయకుడికి 16 రకాల నైవేద్యాలు సమర్పించాలి.

నైవేద్యాలలో పువ్వులు, పండ్లు, స్వీట్లు, ధూప, దీపాలు కూడా ఉంటాయి.పండుగ 10వ రోజున ఆచారంతో వినాయకుడికి వీడ్కోలు పలుకుతుంది.పూజారి మంత్రాలు పఠించి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన ఆశీర్వాదం పొందడానికి పూజలు చేస్తారు.
అంతేకాకుండా పదవ రోజున ఈ ఆచారంలో వినాయక విగ్రహాన్ని నది లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు.వినాయక చవితి పండుగ వేడుకలను మొదలు పెట్టడానికి మీ ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతాన్ని శుభ్రపరచుకోవాలి.
ఆ తర్వాత పూజకు అవసరమైన అన్ని వస్తువులను సిద్ధంగా ఉంచాలి.ఇందులో వినాయకుడి మట్టి విగ్రహం, పూలు, ధూపం, దీపాలు, పండ్లు, స్వీట్లు సంప్రదాయ పూజ సామాగ్రి కూడా ఉంటాయి.
అంతేకాకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంలో శుభ్రమైన వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి.

అలాగే వేదికపై వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.వినాయక చవితి రోజున పూజా సమయంలో షోడశోపచార పూజ( Shodashopachara Puja ) అని పిలవబడే మొత్తం 16 ఆచారాలను అనుసరించి వినాయకుడిని భక్తితో పూజించాలి.ఈ 16 దశాల ఆరాధన వివిధ అంశాలను కలిగి ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే వినాయక చవితి రోజు ఉపవాసం ఉన్నవారు ప్రక్షాళన స్నానంతో రోజును మొదలు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.ఈ ఉపవాసం తెల్లవారుజాము నుంచి చంద్రోదయం వరకు కొనసాగుతుంది.
ఈ సమయంలో ప్రతి రోజు భోజనంలో పండ్లు, పాలు, ఉప ఉత్పత్తులు, పండ్ల రసం వంటివి ఉండవచ్చు అని చెబుతున్నారు.