Telangana BJP : ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు..!!

తెలంగాణ బీజేపీ( Telangana BJP ) నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.

సాయంత్రం జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ( BJP Central Election Committee ) సమావేశానికి వీరు హాజరుకానున్నారు.

ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు హస్తినకు వెళ్లనున్నారు.రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై నేతలు పార్టీ అధిష్టానంతో ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో సిట్టింగ్ స్థానాలను కలుపుకొని తొలి జాబితాలో ఆరు నుంచి ఏడు స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు లోక్ సభ స్థానాలను ఆశిస్తున్న పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ( Delhi )కి చేరుకున్నారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు