ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది.

దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

చాలా కాలంగా జరగకుండా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.మార్చిలో ఎన్నికలు జరిపించాలని ప్లాన్ సిద్ధం చేసుకుంది.దీనికి సంబందించిన పంచాయితీలు, మున్సిపాలిటీల రిజర్వేషన్ లని కూడా ఖరారు చేసింది.

Supreme Court Stay On Ap Local Body Elections-ఏపీలో స్థాన�

అయితే ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పుడు సమస్యగా మారింది.అధికార పార్టీకి అనుకూలంగా పంచాయితీల రిజర్వేషన్ అమలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంచాయితీలలో 50 శాతం మించి రిజర్వేషన్ ఇవ్వడంపై ఇప్పుడు సుప్రీం కోర్టు తప్పు పట్టింది.దీంతో ఎన్నికల నిర్వహణపై జారీ చేసిన జీవోపై స్టే విధించింది.

Advertisement

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 50శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.కాగా హైకోర్టు దానిపై స్పందించలేదు.

దీంతో అతను సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణకు రాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇచ్చిన జీవోపై స్టే విధిస్తూ.

హైకోర్టులో ఉన్న పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

100 కోట్ల క్లబ్బులో అక్కినేని నాగచైతన్య.. అక్కినేని హీరోల రేంజ్ పెరిగినట్టేనా?
Advertisement

తాజా వార్తలు