వైభవంగా కొనసాగుతున్న మినీ సమ్మక్క సారక్క జాతర...!

సూర్యాపేట జిల్లా: పెన్ పహడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలోని కొండల నడుమ కొలువుదీరిన సమ్మక్క సారక్క జాతర రెండో రోజు వైభవంగా జరిగింది.

జిల్లా నలు మూలాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, మొక్కుబడిగా నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.

ఆలయ నిర్వకులు జాతర సందర్భంగా కోలాటం పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయం వద్దకు వచ్చే భక్తులకు దేవిరెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

జాతర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి దర్శించుకొని మొక్కులు చెలించుకున్నారు.ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెన్ పహాడ్ ఎస్ఐ రవీందర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ నాతల వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్ బండి ధనమ్మ, రామకృష్ణారెడ్డి,తూముల భుజంగరావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు,కమిటీ సభ్యులు మామిడి వెంకన్న,దేవిరెడ్డి వెంకట్ రెడ్డి,రాంరెడ్డి,లింగారెడ్డి, సైదిరెడ్డి,అంజమ్మ,సతిరెడ్డి,బెల్లంకొండ శ్రీనివాస్,సరోజమ్మ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

Latest Suryapet News