'ఆహా' బాలయ్య మొత్తం మంచు ఫ్యామిలీనే దించేశాడే!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో బాలకృష్ణ మొదటి సారి హోస్ట్‌ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్‌.ఈ షో లో ఆహా లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.

దీపావళి సందర్బంగా మొదటి ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ షో లో మొదటి గెస్ట్‌ గా మోహన్‌ బాబు రాబోతున్నాడు అనేది మొదటి నుండి వస్తున్న వార్తలు.

తాజాగా ఆ విషయంను నిజం చేస్తూ ఆహా వారు మొదటి ఎపిసోడ్‌ కు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేయడం జరిగింది.అయితే మంచు మోహన్ బాబు మాత్రమే కాకుండా బాలయ్య షో లో మంచు ఫ్యామిలీ మొత్తం దిగి పోయింది.

మోహన్‌ బాబు మరియు ఆయన కొడుకు విష్ణు కూతురు లక్ష్మి ప్రసన్న కూడా హాజరు అయ్యారు.ఈ ముగ్గురుతో బాలయ్య మాట మంతి ఎలా ఉండబోతుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం.

Advertisement

భారీ ఎత్తున అంచనాలున్న ఈ షో కు సంబంధించిన ప్రోమోను నేడు విడుదల చేయబోతున్నారు.

బాలయ్య వంటి స్టార్‌ హీరో హోస్ట్‌ గా టాక్ షో తెలుగు లో మొదటి సారి.ఇప్పటి వరకు స్టార్స్ అయిన సమంత మరియు రానాలు హోస్టింగ్‌ చేశారు.అలీ మరియు ప్రదీప్ లు కూడా టీవీల కోసం హోస్ట్‌ లుగా చేశారు.

కాని ఒక స్టార్‌ హీరో హోస్ట్‌ గా చేయడం చాలా చాలా అరుదైన విషయం అంటున్నారు.అందుకే ఈ షో ఖచ్చితంగా చాలా విభిన్నమైన షో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆహా లో మొదట స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఎపిసోడ్‌ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దీపావళి సందర్బంగా నవంబర్‌ 4వ తారీకున ఈ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అవ్వబోతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

బాలయ్య నుండి త్వరలో అఖండ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ని త్వరలో ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

బోయపాటి బాలయ్య కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది.మొదటి రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వగా మూడవ సినిమా తో హ్యాట్రిక్ కోసం ప్లాన్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు